Wednesday, May 1, 2024

Flash: కార్మికుడు రవీందర్ సేఫ్.. 24 గంటల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్

సింగరేణి గని ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుడు రవీందర్ ను రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. సోమవారం మధ్యాహ్నం నుండి  కార్మికుల ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ సిబ్బంది.. 24 గంటల పాటు శ్రమించిన అనంతరం బదిలీ కార్మికుడు రవీందర్ దాని లోపలి నుండి బయటకు తీసుకు వచ్చి ఆసుపత్రికి తరలించారు. సేఫ్టీ అధికారి జయరాజ్ అండర్ మేనేజర్ చైతన్య తేజ్ తో పాటు తోట శ్రీకాంత్ ఆచూకీ తెలియకపోవడంతో కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. మరో ముగ్గురి కోసం రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement