Thursday, April 25, 2024

మ‌నీలాండ‌రింగ్ కేసు- శివసేన సీనియర్‌ నాయకురాలికి ఈడీ స‌మ‌న్లు

మ‌నీలాండ‌రింగ్ వ్య‌వ‌హారానికి సంబంధించి శివసేన సీనియర్‌ నాయకురాలు, యావత్మాల్‌ ఎంపీ భావనా గవాలీకి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ వ్యవహారానికి సంబంధించిన వచ్చే నెల 5న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపింది. ఇదే కేసులో ఇప్పటికే మూడుసార్లు నోటీసులు ఇచ్చింది. అయితే భావనా ఒక్కసారికూడా విచారణకు హాజవ్వలేదు. దీంతో తాజాగా మరోసారి తాఖీదులు ఇచ్చింది. అయితే ఈసారీ విచారణకు రాకపోతే ఈడీ కోర్టు మెట్లు ఎక్క‌నుంది.ఎంపీ భావనా గవాలీ సహాయకుడైన సయీద్‌ ఖాన్‌ మహిళా ఉత్కర్ష ప్రతిష్ఠాన్‌కు చెందిన నిధులను కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనకు చెందిన రూ.3.75 కోట్ల విలువైన స్థిరాస్తును ఈడీ అటాచ్‌ చేసింది. అయితే ఈ వ్యవహారంలో భావనా గవాలీకి భాగస్వామ్యం ఉంద‌ని, ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని ఈడీ నోలీసులు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement