Thursday, May 9, 2024

పేపర్ లీక్ లో షాద్ నగర్ కు లింకు… సిట్ అదుపులో రాజేంద్ర‌కుమార్

టిఎస్ పిఎస్సి ప్రశ్న పత్రం కొనుగోలుకు రూపాయలు 10 లక్షలకు బేరం..!
ఐదు లక్షల అడ్వాన్స్ గా చెల్లించిన అభ్యర్థి..!
సిట్ అధికారుల అదుపులో షాద్ నగర్ నేరళ్ళ చెరువు గ్రామ యువకుడు..!

హైదరాబాద్ – టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు లింకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ షాద్ నగర్ పరిధిలోని నేరళ్ళ చెరువు గ్రామానికి చెందిన యువకుడి ని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం..

లింకు ఎలా అంటే..
మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం పంచాంగల్ తండ కు చెందిన డాక్య సల్కర్ పేట గ్రామానికి చెందిన తిరుపతయ్య రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధి నేరళ్ళ చెరువు గ్రామనికి చెందిన రాజేంద్ర కుమార్ గతంలో ఆరేళ్ల పాటు గండేడ్ మండలం లో జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసినప్పుడు మిత్రులు. అయితే టీఎస్ పిఎస్సీ నిర్వహించిన ఏఈ పరీక్షల కోసం హైదరాబాద్ లోని దిలిసుక్ నగర్ లో కోచింగ్ తీసుకున్నారు. సరిగ్గా పరీక్ష మూడు రోజులు ముందు తిరుపతయ్య హైదరాబాదు లో కలవగా తను పరీక్షకు ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పాడు. దీంతో తిరుపతయ్య పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రేణుక భర్త డాక్య వద్ద ప్రశ్నాప‌త్రాన్ని తీసుకొని రాజేంద్ర కుమార్ కి ఇచ్చాడు. ఇందుకు రూపాయలు 10 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. రాజేంద్ర కుమార్ రూపాయలు ఐదు లక్షల అడ్వాన్స్ గా తిరుపతయ్యకు ఇచ్చి మిగతా డబ్బులను పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత ఇస్తానని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రాజేంద్ర కుమార్ సిట్ అధికారుల బృందం రాత్రి అదుపులోకి తీసుకొని హైదరాబాదుకు తరలించినట్లు సమాచారం . కాగా, రాజేంద్రకుమార్ అప్పు చేసి మరి తిరుపతయ్యకు డబ్బులు ముట్ట చెప్పినట్లు తెలిసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement