Wednesday, May 22, 2024

విక్ర‌మార్కుడికి సీక్వెల్ హిందీలో – క‌థ ఇచ్చేది ఎవ‌రో తెలుసా

మాస్ మ‌హారాజ్ రవితేజ హీరోగా , ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ‘విక్రమార్కుడు’ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.దాంతో ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ రాబోతుంది. కానీ, తెలుగులో కాదు.. హిందీలో. ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని బాలీవుడ్‌లో స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌తో ‘రౌడీ రాథోడ్‌’గా రీమేక్‌ చేశారు. దీనికి ప్రభుదేవ దర్శకత్వం వహించగా.. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మాతగా వ్యవహరించారు. అక్కడ కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సీక్వెల్‌గా ‘రౌడీ రాథోడ్‌-2’ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

‘విక్రమార్కుడు’కు కథ అందించిన.. దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ రచయిత విజయేంద్ర ప్రసాదే ఈ సీక్వెల్‌ కోసం స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తున్నారట. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. ‘రౌడీ రాథోడ్‌-2’ కోసం సంజయ్‌ లీలా భన్సాలీ.. విజయేంద్ర ప్రసాద్‌ను సంప్రదించారట. దీంతో కథ, స్క్రిప్ట్‌ రాసివ్వడానికి ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. కాగా.. ‘రౌడీ రాథోడ్‌’ కథకు కొనసాగింపుగా కాకుండా.. ఒక కొత్త కథతో సీక్వెల్‌ రాబోతుందట. ఇందులో అక్షయ్‌ కుమార్‌.. సోనాక్షి సిన్హా పాత్రలు మాత్రం యథాతథంగా కొనసాగిస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement