Thursday, May 9, 2024

Stock Market: బుల్ జోష్.. 296 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 296 పాయింట్లు లాభపడి 57,420కి చేరింది. నిఫ్టీ 83 పాయింట్లు పుంజుకుని 17,086 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా పడిపోయింది. ఒమిక్రాన్ నేపథ్యంలో మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే ట్రేడ్ అయినప్పటికీ… చివరకు లాభాల్లో ముగిశాయి.

టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్,  సన్ ఫార్మాలకు లాభాలు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement