Monday, April 29, 2024

హిమపాతంలో చిక్కుకున్న 150 మంది టూరిస్టులు.. రెస్క్యూ చేసి కాపాడిన పోలీసులు..

ఉత్త‌రాదిని చ‌లిగాలు వ‌ణికిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో భారీగా మంచు కురుస్తోంది. ఆదివారం రాత్రి ప్రశార్ సరస్సు వ‌ద్ద‌ హిమపాతంలో చిక్కుకుపోయిన 40 వెహికల్స్, 150 మంది టూరిస్టుల‌ను హిమాచల్ ప్రదేశ్ పోలీసులు కాపాడారు. దాదాపు 12 గంటలపాటు రెస్య్కూ చేసి వారిని కాపాడినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

దీనిపై మండి జిల్లా ఎస్పీ షాలిని అగ్నిహోత్రి మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ ప్రాంతంలో మంచు కారణంగా టూరిస్టులు చిక్కుకుపోయార‌ని, ప్రశార్ సరస్సు వ‌ద్ద‌ 40 వాహనాలు, సుమారు 150 మంది వ్యక్తులను పోలీసులు ర‌క్షించార‌ని తెలిపారు. గత రాత్రి 12 గంటల ఆపరేషన్ తర్వాత వారిని సుర‌క్షితంగా తీసుకొచ్చామ‌ని ఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement