Friday, May 3, 2024

భార‌త్ జోడో యాత్ర‌లో సీత‌క్క‌.. రాహుల్ గాంధీకి బూట్లు బ‌హుక‌రించిన ఎమ్మెల్యే

మధ్యప్రదేశ్ : తెలంగాణ కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి ఎమ్మెల్యే సీతక్క నాయకులు .. ప్రజలతో చురుకుగా సంభాషించారు. ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్‌లో వీడియోను తన ఫాలోవర్లతో పంచుకుంది. ఆమె తన పోస్ట్‌లో ఇలా రాసింది మీరు శక్తిని అనుభవిస్తున్నారు మీరు #BharatJodoYatraలో చేరినప్పుడు మీరు జీవితంలో స్ఫూర్తిదాయకమైన వైబ్‌లను అనుభవిస్తారు, @bharatjodoలో ప్రతి ఒక్కరూ చూపిస్తున్న అద్భుతమైన కృషి .. నిబద్ధత చెప్పుకోదగినది. తెలంగాణలో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క రాహుల్ గాంధీకి బూట్లని బహుకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement