Saturday, April 20, 2024

Road Accident : నెల్లూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి..

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. దగదర్తి మండలం కౌరుగుంట వద్ద జాతీయ రహదారిపై లారీని ఆటో ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. ఏడుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. చెలికిసంఘంకి చెందిన 18 మంది ఆటోలో వెళుతుండగా ప్రమాదం జరిగింది. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. అనంత‌రం క్షతగాత్రులను కావలి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement