Thursday, May 9, 2024

అనుమానాస్ప‌ద స్థితిలో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌..

అనుమానాస్ప‌ద స్థితి డిగ్రీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న బందరు మండలంలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బందరు మండలం గోకవరం గ్రామానికి చెందిన విద్యార్థిని మచిలీపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. రెండు రోజుల క్రితం త‌ల్లి పుట్టింటికి వెళ్లగా.. తండ్రి పనికి వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటల సమయంలో తండ్రి ఇంటికి వచ్చి చూడగా కూతురు ఫ్యానుకు ఉరి వేసుకొని కనిపించింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం అనుమానాస్పద మృతిగా ఎస్ఐ చాణక్య కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement