Wednesday, May 15, 2024

స‌ర్కారు వారి పాట చిత్రం డ‌బ్బింగ్ పూర్తి చేసిన – హీరోయిన్ కీర్తి సురేశ్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టిస్తోన్న తాజా చిత్రం స‌ర్కారువారిపాట‌. ఈ చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేశ్.కాగా త‌న పాత్ర‌కి డ‌బ్బింగ్ ని పూర్తి చేసిన‌ట్లు వెల్ల‌డించింది ఈ బ్యూటీ. వినూత్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న న‌టి కీర్తి సురేష్. ‘నేనుశైల‌జ’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటి తెలుగు త‌నంతో కూడిన అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను మాయ చేసింది. ‘మ‌హాన‌టి’ చిత్రంతో కీర్తీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. మ‌హాన‌టి త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు కీర్తీ న‌టించిన ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఫ‌లితం ఇవ్వ‌లేదు. గ‌త‌రెండేళ్ళుగా ఈమె హిట్టుకోసం ఎంత‌గానో ఎదురుచూస్తుంది. ప్ర‌స్తుతం ఈమె చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలున్నాయి. ఇక‌ తెలుగులో ఈమె న‌టించిన లేటెస్ట్ చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రానికి ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ క్ర‌మంలో కీర్తి సురేష్ త‌న డ‌బ్బింగ్ పార్ట్‌ను పూర్తి చేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. డైరెక్ట‌ర్ ప‌రుశురాం, త‌మ‌న్‌ల‌తో క‌లిసి దిగిన ఆ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. సోమ‌వారం సాయంత్రం ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement