Monday, April 29, 2024

Breaking: నడి బజారులో ఇంటర్ ఆన్సర్ బుక్ లెట్లు..

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న వేళ.. పేపర్ లీక్ అవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. అయినా విద్యా శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్య ధోరణితో ఉంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇంటర్ పరీక్షలు సైతం ఆదే తీరుతో వ్యవహరిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి నెల్లూరు జిల్లాలో జరగనున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలు, జవాబు బుక్ లెట్లు ఇప్పటికే స్ట్రాంగ్ రూంకు చేరుకున్నాయి. అక్కడ నుంచి జిల్లాలోని పరీక్ష కేంద్రాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ప్రశ్న పత్రాలను భద్ర పరిచారు. అయితే ఆన్సర్ బుక్ లెట్ ల విషయంలో ఇంటర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నెల్లూరు నుంచి ఆత్మకూరుకు టాటా ఏసీ టాపుపై పెట్టుకొని తీసుకెళ్తున్న ఘటన సోమవారం మధ్యాహ్నం నెల్లూరు నగరంలో ఆంధ్రప్రభ క్లిక్ మనిపించింది. అంగడిలో సరుకులా ఇంటర్ ఆన్సర్ బుక్ లెట్లు తీసుకుపోవడంపై ఇంటర్ అధికారుల నిర్లక్షంపై విద్యార్ధుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement