Monday, April 29, 2024

స‌మంత ‘ఐటెం’ సాంగ్ పాడిందెవ‌రో తెలుసా

పాన్ ఇండియా మూవీ పుష్ప‌లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఐటెంసాంగ్ లో న‌టించింది. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో క‌లిసి ఆడిపాడింది స‌మంత‌. కాగా ఈ పాట‌కి లిరిక్స్ ని చంద్ర‌బోస్ స‌మ‌కూర్చారు. ఈ పాట మాస్ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. కాగా ఈ పాటలోని లిరిక్స్ పై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. సమంత స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. సమంత గ్లామర్, దేవిశ్రీ సంగీతం ఒక ఎత్తైతే.. ఈ పాటని పాడిన ఇంద్రావతి చౌహన్ తన మత్తు వాయిస్ తో నెక్స్ట్ లెవల్ కి చేర్చింది. దాంతో ఇంద్రావతి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఆమె బయోడేటా గురించి గూగుల్ లో సెర్చింగ్ మొదలు పెట్టారు.

ఇంద్రావతి ఎవరో కాదు.. టాలీవుడ్ ఫేమస్ జానపద గాయని మంగ్లీకి స్వయానా చెల్లెలు. ఇప్పుడిప్పుడే ఇంద్రావతి టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది. ఈమె కూడా జానపద పాటలు పాడుతుంది. ఇంద్రావతి జార్జి రెడ్డి చిత్రంలో జాజి మొగులాలి అనే పాటని పాడింది. అదే చిత్రంలో మంగ్లీ పాడిన ‘వాడు నడిపే బండి’ సాంగ్ సూపర్ హిట్ అయింది . సంగీత దర్శకుడు కోటి జడ్జిగా వ్యవహరించిన ‘బోల్ బేబీ బోల్’ షోలో కూడా ఇంద్రావతి పాల్గొంది. పుష్ప చిత్రంలోని స్పెషల్ సాంగ్ ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు. ‘ఊ అంటావా మావ ఊ ఊ అంటావా’ అంటూ మత్తు వాయిస్ తో ఇంద్రావతి మ్యాజిక్ చేస్తోంది. ఇదే పాటని కన్నడలో మంగ్లీ పాడడం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement