Thursday, May 2, 2024

వ్యాక్సిన్ వేసుకోకుంటే జీతం బంద్.. ఎక్కడంటే

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని నాశనం చేసింది. కొన్ని నెలల పాటు జ‌న‌జీవ‌నం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి మన దగ్గరున్న ఏకైక ఆయుధం వ్యాక్సినేషన్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్ర‌మంలో భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. వంద కోట్లకు పైగా డోస్ లతో భారత్ ప్రపంచదేశాలకే సవాల్ విసురుతోంది. కేంద్రం ప్రభుత్వం కూడా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుండడంతో అందరూ వ్యాక్సిన్ కోసం మొగ్గు చూపుతున్నారు.

అయితే ఇప్పటికీ కొంతమంది అనుమానాలతో టీకా వేసుకోవ‌డానికి పెద్దగా ఇంట్ర‌స్ట్ చూప‌డం లేదు. అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ ప్రకటనలు చేస్తున్నా.. కొందరు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే కొన్ని దేవాలయాలతో పాటు పలు ప్రదేశాల్లో రెండు డోస్లు వ్యాక్సిన్లు తీసుకుంటూనే అనుమతిస్తామంటూ కఠినంగా ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు.

అయినా కొందరు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవట్లేదు. ఇలాంటి సమస్యే మహారాష్ట్రాలోని థానే మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎదురైంది. ఉద్యోగులు వ్యాక్సినేషన్కు సహకరించకపోవడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎంసీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగి ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే వారికి జీతం నిలిపి వేస్తామని ఆదేశాలు జారీ చేశారు.

కనీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ డోస్ అయినా వేసుకుంటేనే జీతం ఇస్తామని తేల్చి చెప్పారు. ఇక సింగిల్ డోస్ తీసుకొని రెండో డోస్ వ్యవధి ముగిసిన వారికి కూడా జీతం అందించమని స్పష్టం చేశారు. ఉద్యోగులు కచ్చితంగా వ్యాక్సినేషన్ పూర్తయిన సర్టిఫికేట్లను చూపించాలని ఆదేశించారు. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియను పెంచే క్రమంలో నగర పరిధిలో వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నేటి నుంచి ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement