Thursday, May 2, 2024

సాగు చ‌ట్టాల మాదిరిగా -అగ్నిప‌థ్ ని వెన‌క్కి తీసుకోండి- అస‌దుద్దీన్ ఒవైసీ

సాగు చ‌ట్టాల మాదిరిగానే అగ్నిప‌థ్ ని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఒవైసీ .అగ్నిపథ్ పథకం కచ్చితంగా సరైనది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం ఇది. దేశానికి ఇది ఎంత మాత్రం మంచిది కాదు. మన నేవీ అధికారులు, జవానులు కాంట్రాక్టు ఉద్యోగులని లేదా కాంట్రాక్టు లెక్చరర్లని ప్రధాని మోడీ భావిస్తున్నారు. కానీ వారిది గౌరవనీయమైన వృత్తి. మోడీ భూమి, సాగు చట్టాలను ఎలా అయితే ఉపసంహరించుకున్నారో.. భద్రత, దేశ యువతను దృష్టిలో పెట్టుకుని అగ్ని పథ్ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాల‌ని ఒవైసీ ఓ వార్తా సంస్థకి తెలిపారు.
సైనిక చీఫ్ ల వెనుక దాగి ఉండొద్దు మిష్టర్ మోడీ. మీ నిర్లక్ష్య నిర్ణయానికి బాధ్యత తీసుకునే దమ్ము ఉందా .. తమ భవిష్యత్తు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఈ దేశ యవత మీకు సమాధానం చెబుతుంద‌ని అసదుద్దీన్ ట్వీట్ కూడా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement