Saturday, April 20, 2024

తక్షణమే అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలి.. కోదండరామ్

అగ్నిపథ్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్రానికి అర్థం కావాలనే యువత ఆందోళన అన్నారు. నిరుద్యోగ సమస్యను గుర్తిచడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు వాడకుండా ఫైరింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. జరిగిన పరిణామాలపై న్యాయ విచారణ జరగాలన్నారు. పెన్షన్లు వంటివి తప్పించుకోవడానికే అగ్నిపథ్ తెచ్చారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement