Sunday, April 28, 2024

India: రూపాయి విలువ తగ్గడం లేదు.. డాలర్​ విలువ పెరుగుతోంది: నిర్మలా ​

భారత రూపాయి విలువ పతనం కావడం లేదని, కానీ, అమెరికా డాలర్​ రేటు బలపడుతోంది అన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. అమెరికా పర్యటనలో ఉన్న భారత ఆర్థిక మంత్రి మీడియాతో ఇవ్వాల (ఆదివారం) ఈ విషయం స్పష్టం చేశారు. ఇతర ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువను డాలర్​ అధిగమించిందని చెప్పారు. రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 82.69కి చేరిన కొద్ది రోజులకే మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. డాలర్ బలపడడమే రూపాయి పతనానికి కారణమని నిర్మలా సీతారామన్ అన్నారు. రూపాయి  బలహీనపడలేదని, అయితే.. నిరంతరంగా డాలర్ విలువ బలపడుతున్నట్లు చెప్పారు. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధిక అస్థిరతను నివారించడంలో ఆందోళన చెందుతోందని.. భారతీయ కరెన్సీ విలువను నిర్ణయించడానికి మార్కెట్‌లో తాము జోక్యం చేసుకోవడం లేదని ఆర్థిక మంత్రి నిర్మల అన్నారు. USD రేట్లు పెరగడం వల్ల భారతీయ రూపాయి విలువ తగ్గుతూ వస్తోందనేది వాస్తవం. USDకి అనుకూలంగా మారకం రేటు పెరిగింది. అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీల కంటే భారతీయ రూపాయి చాలా మెరుగ్గా ఉంది అని చెప్పారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తాజా రౌండ్ తరుగుదల ప్రతికూల ప్రపంచ పరిణామాల ఫలితంగా ఉంది. ఇది ఇంతకు ముందు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ప్రారంభమైంది. ఈ ఏడాది జరిగిన వార్​తో వస్తువుల ధరలు పెరిగాయి. ఫలితంగా అభివృద్ధి చెందిన దేశాలలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగింది. US ఫెడ్ వడ్డీ రేట్లను తీవ్రంగా పెంచడానికి ప్రేరేపించింది. దీని ఫలితంగా  భారత కరెన్సీ విలువ తగ్గిపోతూ వస్తోంది అని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement