Thursday, May 2, 2024

West Bengal: రూ.5కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

పశ్చిమ బెంగాల్ పోలీసులు 5 కోట్ల రూపాయలకు పైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఇద్దరు నిందితుల్లో 35 ఏళ్ల గౌర్ సర్కార్ ఉండగా మరొకరు 60 ఏళ్ల గోలంగా గుర్తించారు. ఈరోజు వారిని బెర్హంపూర్‌లోని కోర్టు ముందు హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు. రూ.5 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్‌తో ఉన్న ఇద్దరు వ్యక్తులను పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది.

నిందితులు నిషిద్ధ వస్తువులు తీసుకెళ్తున్నట్లు ఇంటెలిజెన్స్ కు సమాచారం అందడంతో అధికారులు బెర్హంపూర్ బస్టాండ్ ప్రాంతంలో దాడి చేశారు. ఇద్దరినీ అరెస్టు చేసి, నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్ధాల చట్టంకు సంబంధించిన నిబంధనలతో అభియోగాలు మోపారు. ఇందులో డ్రగ్ కార్టెల్‌ను మరింత విచారించడానికి, పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం నిందితులను రిమాండ్‌కు పంపాలని పోలీసులు కోరనున్నారు. ఇద్దరు నిందితులను, వారి సామాన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వారి నుంచి మొత్తం 4 కిలోల 800 గ్రాముల నిషిద్ధ మార్ఫిన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ ఇంద్రజిత్ బసు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement