Tuesday, May 7, 2024

వరదలపై ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణలో సంభవించిన వరదలపై ప్రధాని నరేంద్ర మోడీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలన్నారు. దాదాపు 11లక్షల ఎకరాల్లో పంట నీటమునిగిందన్నారు. చాలా మంది వరదల్లో చనిపోయారన్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు. కాళేశ్వరం పంప్ హౌస్ లోకి నీళ్లు చేరాయన్నారు. నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ను తెలంగాణకు పంపించాలన్నారు. పంటనష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement