Tuesday, May 14, 2024

నా కుమారై బ‌ర్త్ డే వేడుక‌ల‌కి అసెంబ్లీని అద్దెకివ్వండి.. ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో

త‌న కుమారై బ‌ర్త్ డే వేడుక‌ల కోసం అసెంబ్లీనే అద్దెకు అడిగాడు ఓ వ్య‌క్తి. అంతేకాదు అసెంబ్లీ అద్దెకోసం స్పీక‌ర్.. జిల్లా క‌లెక్ట‌ర్ కి లేఖ కూడా రాశాడు బెళగావి జిల్లా గోకాక్ తాలూకా ఘటప్రభ నివాసి లాయర్ మల్లికార్జున చౌకశీ. తన ఒక్కగానొక్క కూతురు మణిశ్రీ ఐదో పుట్టినరోజును గుర్తుండి పోయే విధంగా జరపాలనుకుంటు న్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. నా ఒక్కగానొక్క కూతురు మణిశ్రీకి జనవరి 30న 5వ సంవత్సరం పూర్తవుతుంది. ఆమె 1వ తరగతిలో ప్రవేశం పొందబోతుంది. ఇది ఆమె జీవితంలో అమూల్యమైన క్షణం.

అందుకే ఆమె పుట్టినరోజు జరుపుకు నేందుకు కర్ణాటక సువర్ణసౌధను నాకు ఒక రోజు అద్దెకు ఇవ్వండి.ఎంతైన ఆఫర్వాలేదు.. చెల్లిస్తాను అని జిల్లా కలెక్టర్ కి స్పీకర్ కి అభ్యర్థించారు. నాలుగు అంతస్తుల సువర్ణ సౌధ భవనం కర్ణాటక శాసనసభ సమావేశాలను నిర్వహించడానికి సంవత్సరానికి ఒకసారి(ఏటా శీతాకాలంలో) మాత్రమే ఉపయోగిస్తారు. ఆ పదిరోజులు సభ జరిపేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుంది. ఈ ఖర్చులకు తగ్గట్టుగా దానిని సాధారణ సమయాలలో అద్దెకు ఇస్తే బాగుంటుందని.. తద్వారా నిర్వహణ ఖర్చులను ఆదా చేయవచ్చని అభిప్రాయపడ్డారు మల్లికార్జున. సభా సమావేశాలు కూడా కొనసాగుతాయని దీనిపై సభలో చర్చించి అద్దెకు ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో మ‌రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement