Monday, April 29, 2024

మోడీ విధానాలతో సంపన్నులకే ప్రయోజనం.. దిగ్విజయ్ సింగ్

మోడీ విధానాలతో సంపన్నులకే ప్రయోజరం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, రాష్ట్ర కాంగ్రెస్ అడ్వైజర్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీని గెలిపించేందుకే కొన్ని సీట్లలో ఎంఐఎం పోటీ చేస్తోందన్నారు. కాంగ్రెస్ లేకుండా తెలంగాణ లేదని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్న ఆయన అవినీతిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

అటు బీజేపీ పాలనలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అమాయకుల మీద ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు చేస్తున్నారన్నారు.నిర్దోషుల మీద ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందన్న దిగ్విజయ్ సింగ్ సర్కార్ పై అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement