Thursday, April 25, 2024

ఉక్రెయిన్ పై యుద్ధానికి ముగింపు ప‌ల‌క‌నున్న ర‌ష్యా.. పుతిన్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తోన్న అధినేత‌లు

దౌత్య ప‌ర‌మైన చ‌ర్చ‌ల ద్వారా ఉక్రెయిన్ పై యుద్ధానికి ముగింపు ప‌ల‌కాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రష్యా-ఉక్రెయిన్ మధ్య పది నెలలుగా జరుగుతున్న యుద్ధం జ‌రుగుతోంది. దాంతో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధం కారణంగా ఇరువైపులా భారీ నష్టం జరుగుతోంది. ప్రపంచం మొత్తం రష్యాపై వేలెత్తి చూపిస్తున్న వేళ పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. శత్రుత్వం తీవ్రత భరించలేని నష్టాలకు దారితీస్తుందని తాను ఇప్పటికే పలుమార్లు చెప్పినట్టు పుతిన్ గుర్తు చేశారు.

అన్ని సాయుధ ఘర్షణలు దౌత్య మార్గంలో ఏదో ఒకరమైన చర్చల ద్వారానో, లేదంటే మరోలానో ముగుస్తాయని పుతిన్ అన్నారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్ మాత్రం వ్యతిరేకిస్తోందని రష్యా చెబుతోంది. అయితే, ఉక్రెయిన్ వాదన మరోలా ఉంది. చర్చలు జరగాలంటే తొలుత దాడులు ఆపి, తమ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని తిరిగి అప్పగిస్తే అప్పుడు చూద్దామని ఉక్రెయిన్ చెబుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ తర్వాతి రోజునే పుతిన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement