Friday, May 3, 2024

మట్టి తోడేది జేసీబీ.. కప్పు కొట్టేది ఆర్‌సీబీ

ఈ నినాదం ఏంటి అనుకున్నారా.. గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగానే ఆర్సీబీ అభిమానులు సోషల్ మీడియాలో చేసిన నినాదం. ఈసారి కప్పు ఎలాగైనా తమ అభిమాన టీమ్ సాధిస్తుందంటూ వాళ్లు ధీమా వ్యక్తం చేశారు. ఇక ముంబై వాంఖడే వేదికగా రాజస్థాన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు ఛేజింగ్‌లో మెరుపులు మెరిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, పడిక్కల్ దూకుడుగా ఆడుతూ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఆడుతున్నాడు. ఆర్‌సీబీ కేవలం 17 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 181 పరుగులు సాధించి ఘన విజయం సొంతం చేసుకుంది. పడిక్కల్ (101) అద్భుతమైన సెంచరీతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. పడిక్కల్‌కు తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ(72) రాణించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement