Sunday, April 28, 2024

Telangana: టీఆర్‌ఎస్‌లో చేరిన రాపోలు.. గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్‌

బీజేపీ లీడర్​, రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ ఇవ్వాల (బుధవారం) టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్​ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రాపోలు వెంట పలువురు పద్మశాలీ సంఘం నాయకులు కూడా ఇవ్వాల టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ.. రాపోలు ఆనందభాస్కర్‌ను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. రాపోలు సామాజిక స్పృహ కలిగిన విద్యావేత్త అని కొనియాడారు. చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల కోసం సీఎం కేసీఆర్‌ పలు పథాకాలు అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత రంగమేనని పేర్కొన్నారు. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశంలో చాలామంది అద్భుత ప్రతిభ ఉన్న చేనేత కళాకారులు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో నేతన్నకు చేయూత, చేనేత లక్ష్మి పేరుతో కార్మికులను ఆదుకుంటున్నామని తెలిపారు. నేతన్నకు బీమాతో కార్మికులకు అండగా ఉంటున్నామని, చేనేత కళాకారులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement