Friday, May 3, 2024

ఈ నెల 29నుంచి , వ‌చ్చే నెల మూడు వ‌ర‌కు రాష్ట్ర‌ప‌తి విడిది

ప్ర‌తి ఏడాది శీతాకాలం విడిదిగా రాష్ట్ర‌ప‌తి సికింద్రాబాద్ లోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌నానికి రావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. ఈ మేర‌కు ఈ నెల 29న సికింద్రాబాద్ రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో రామ్ నాథ్ కోవింద్ బ‌స చేయ‌నున్నారు. వ‌చ్చే నెల మూడో తేదీ వ‌ర‌కు రాష్ట్ర‌ప‌తి హైద‌రాబాద్‌లో ఉండ‌నున్నారు. రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో సీఎస్ సోమేశ్ కుమార్ స‌మావేశ‌మ‌య్యారు. రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌నకు అన్ని ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అవ‌స‌ర‌మైన మేర‌కు ర‌హ‌దార్ల మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్, కంటోన్మెంట్ బోర్డు సీఈవోకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement