Wednesday, May 1, 2024

కేఏ పాల్ హత్యకు మోదీ కుట్ర: వీడియో షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు. అంతేకాదు తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పబ్లిసిటి చేస్తారు. తాజాగా ఆయన కేఏ పాల్‌ ను టార్గెట్‌ చేశారు. తననను హత్య చేసేందుకు ప్రధాని మోడీ పన్నాగం పన్నినట్లు కేఏ పాల్‌ వ్యాఖ్యానించిన ఓ వీడియోను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో.. ”ప్రధాని మోడీ నన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. నేను రష్యా వెళుతున్న విషయం తెలుసుకుని.. హత్య చేయాలని అనుకున్నాడు. దీని కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో డీల్‌ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఓ అధికారి నాకు చెప్పాడు. ప్రధాని మోడీ నన్ను ఏం చేయలేడు ”అంటూ కేఏ పాల్‌ వ్యాఖ్యానించారు. అయితే, ఈ వీడియోను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్‌ చేయగా.. అది వైరల్‌ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement