Wednesday, May 1, 2024

రామ్ చ‌ర‌ణ్ కి లెక్క‌లు వేసుకుని ప‌ని చేయ‌డం ఇష్ట‌ముండ‌దు – కొర‌టాల శివ‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిదానికీ లెక్క‌లు వేసుకుకోవ‌డం ..డిజైన్ చేసుకోవ‌డం ఆయ‌న‌కి అల‌వాటు లేనిప‌ని.. తనకి నచ్చింది చేసుకుంటూ వెళ్లిపోవడమే ఆయనకి తెలిసిందన్నారు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. అలా నమ్మిచేస్తాం గనుకనే వచ్చే అవుట్ పుట్ కూడా అలాగే ఉంటుంది. అందువల్లనే మా ఇద్దరికీ సెట్ అయింది. ‘ఆచార్య’ విషయంలోను అదే జరిగింది. కథ బాగుంటే .. సినిమా నచ్చితే వచ్చే ప్రశంసలు వస్తూనే ఉంటాయి. సహజంగానే కెరియర్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ముందుగా అనుకున్న టార్గెట్ పూర్తయిన తరువాత, నెక్స్ట్ టార్గెట్ గా ఇతర భాషల్లో విడుదల గురించిన ఆలోచన చేస్తాము. పాన్ ఇండియా అనేదాని గురించి నేను ఆలోచన చేయనుగానీ, తరువాత చేసే సినిమా మాత్రం భారీగానే ఉండనుంద‌న్నారు. ‘ఆచార్య’ భారీ అంచనాల మధ్య ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement