Saturday, April 20, 2024

Crime: తిరుపతిలో యువకుడి దారుణ హత్య

తిరుపతిలోని దాసరి మఠంలో యువకుడి దారుణ హత్య జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. తిరుపతి నగరంలోని పని థియేటర్ సమీపంలో ఉన్న దాసరి మఠంలో సత్యనారాయణ కుమారుడు చంద్ర(30)ను జిమ్ ట్రైనర్ చెంచయ్య దారుణంగా హత్య చేశాడు. గత కొద్ది రోజులుగా చంద్ర అక్కను  చెంచయ్య ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. చంద్ర అక్కను బ్లాక్ మెయిల్ చేయడంతో చెంచయ్యను హెచ్చరించారు. దీంతో జిమ్ ట్రైనర్ చెంచయ్య నిన్న రాత్రి అమ్మాయికి ఫోన్ చేసి ఇంటి కిందకి రావాలన్నాడు. అయితే, ఆ అమ్మాయి రాకపోవడంతో ఇంటి కింద వెళ్తున్న చంద్రను అతి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలిని పరిశీలించారు. హత్య జరిగిన సంఘటనలను ఆరా తీసి మృతదేహాన్ని ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించారు.జ

Advertisement

తాజా వార్తలు

Advertisement