Thursday, May 2, 2024

రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌లో.. ప్రియాంక‌గాంధీ పెంపుడు శున‌కం

రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడోయాత్ర‌లో ..ప్రియాంక‌గాంధీ పెంపుడు శున‌కం కూడా పాల్గొన‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.దీని పేరు లూనా. రాహుల్ భారత్ జోడో యాత్ర హర్యానా రాష్ట్రంలోకి ప్రవేశించింది. రాహుల్ పాదయాత్ర చేస్తున్న సమయంలో లూనా కూడా కొద్ది దూరం నడిచింది. దీనికి సంబంధించి ఫొటోను రాహుల్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. బాక్సర్ విజేంద్ర సింగ్ సైతం రాహుల్ జత కలిశారు. రాహుల్ తో కలసి లూనా నడుస్తున్న ఫొటోను ప్రియాంకా సైతం ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి, హాస్యంగా క్యాప్షన్ పెట్టారు. ‘లూనా అపహరణకు గురైంది’అని పేర్కొన్నారు. దీనికి రాహుల్ స్పందిస్తూ.. ‘ఆందోళన చెందకు ప్రియాంక, మేం వాకింగ్ కు వెళుతున్నామంతే’ అని కామెంట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చివరి దశలో ఉన్నారు. మధ్య మధ్యలో వివిధ రాష్ట్రాల పరిధిలో అక్కడి నాయకులు కూడా రాహుల్ తో కొద్ది దూరం పాటు నడిచి తమ వంతు మద్దతు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement