Thursday, May 9, 2024

తెలంగాణ నేతలతో మరోసారి రాహుల్ గాంధీ భేటీ

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతుల ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఈ నెల 4న సాయంత్రం 5 గంటలకు తెలంగాణ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం అవుతున్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అన్ని రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలో పార్టీకి నిరుత్సాహాన్ని కలిగించాయి. అలా కాకుండా ఉండడానికి పార్టీ దృష్టి సారించింది. కాంగ్రెస్ లో అన్ని గ్రూప్ నాయకులను ఆహ్వానం అందింది. విహెచ్,జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఆహ్వానం అందించారు. అందరిని పిలవాలని పార్టీ సీనియర్ నేత కేసి వేణుగోపాల్ కి రాహుల్ ఆదేశించారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. ప్రతి శనివారం సమావేశాలు జరగాలని, మాణిక్యం ఠాగూర్ కూడా అదనపు సమయం తెలంగాణకు కేటాయిస్తానని తెలిపారు. ఈ మేరకు పార్టీ నేత మధుయాష్కీ గౌడ్ వివరించారు.  తెలంగాణ కోసం కాంగ్రెస్ నాయకులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement