Monday, April 29, 2024

Breaking: ముగిసిన రాహుల్ గాంధీ పర్యటన… ఢిల్లీకి పయనం

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ముగిసింది. ఆయ‌న శంషాబాద్ నుంచి ఢిల్లీకి బ‌య‌లుదేరారు. రెండు రోజుల తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం వ‌రంగ‌ల్‌లో టీపీసీసీ నిర్వహించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌లో పాల్గొన్న రాహుల్‌.. రెండో రోజైన శ‌నివారం హైద‌రాబాద్‌లో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ రోజు ఉద‌యం దామోద‌రం సంజీవ‌య్య పార్కుకు వెళ్లిన రాహుల్…మాజీ సీఎం దామోద‌రం సంజీవ‌య్య‌కు నివాళి అర్పించారు. ఆ త‌ర్వాత చంచ‌ల్‌గూడ జైలుకు వెళ్లారు. జైల్లో ఉన్న ఎన్ఎస్‌యూఐ నేత‌ల‌తో రాహుల్ మాట్లాడారు. త‌ద‌నంత‌రం నేరుగా గాంధీ భ‌వ‌న్ చేరుకుని పార్టీ నేత‌ల‌తో విస్తృత స్థాయి స‌మావేశంలో కీల‌క ప్రసంగం చేశారు. అనంతరం అమ‌ర‌వీరుల స్థూపాన్ని సంద‌ర్శించిన రాహుల్.. పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బ‌య‌లుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement