Friday, April 26, 2024

మ‌ల‌క్‌పేట ఆస్పత్రిలో అగ్నిప్ర‌మాదం.. పేషెంట్లకు త‌ప్పిన ప్రాణ‌పాయం

హైదరాబాద్​లోని మ‌ల‌క్‌పేట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని స‌లీం న‌గ‌ర్‌లో శ‌నివారం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఫ‌ర‌హ‌త్ ఆస్ప‌త్రి గేటు స‌మీపంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన హాస్పిటల్​ సిబ్బంది అక్కడున్న పేషెంట్లను హుటాహుటిన వేరే భ‌వ‌నానికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. ఆస్ప‌త్రి ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. అయితే అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ న‌ష్టం జరగలేదని ఆస్ప‌త్రి యాజ‌మాన్యం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement