Thursday, May 2, 2024

ట్రెండింగ్ లో రాధేశ్యామ్ ఫ‌స్ట్ సింగిల్..10మిలియ‌న్ల వ్యూస్..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న భారీ ప్రాజెక్ట్ రాధేశ్యామ్. ఈ చిత్రంలో ప్ర‌భాస్ కి జోడీగా పూజాహెగ్డే న‌టిస్తోంది. కాగా భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్ రిలీజ్ అయింది. ”ఈ రాతలే” అనే లిరిక్స్ తో ప్రారంభం అయ్యే.. ఫుల్ సాంగ్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. యానిమేషన్‌లా చూపించడంతో ప్రభాస్, పూజా హెగ్డేలు ఈ లిరికల్ వీడియోలో స్పష్టంగా కనిపించలేదు. కానీ సినిమా కాన్సెప్ట్ ఏంటో మాత్రం అందరికీ అర్థమయ్యేలా ఉంది.

ఎవరో వీరెవరో కలవనీ ప్రేమికులా?.. ఎవరో వీరెవరో విడిపోనీ యాత్రికులా అంటూ మొదటగా పాట వస్తుంది. ఆ సమయంలో పూజా హెగ్డే ట్రైన్‌లో ప్రయాణిస్తూ ఉంటుంది. కారులో ప్రభాస్ వస్తున్నాడు. చేతిలో చేయి వేసి తీసుకునే లోపు ట్రైన్ ప్రమాదం జరుగుతుంది. అంటే అక్కడ ఆ ఇద్దరూ కలుసుకోరని, చనిపోతారని అర్థమవుతోంది. కాగా ఈ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సాంగ్ కి 10మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయని యూవీ క్రియేష‌న్స్ ట్వీట్ చేసింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్ ని కూడా రిలీజ్ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement