Friday, April 26, 2024

మునుగోడుకు తరలిస్తున్న కోటి రూపాయల పట్టివేత.. పోలీసులను చూసి పరారయ్యే క్రమంలో..

హైదరాబాద్ శివారులోని నార్సింగి రోటరీ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులకు వింత పరిస్థితి ఎదురయ్యింది. పోలీసులను చూసి తప్పించుకుని పారిపోతున్న వారిపై అనుమానంతో వారిని వెంబడించి పట్టుకోగా రెండు కార్లలో తరలిస్తున్న కోటి రూపాయల నగదు కనిపించింది. దీంతో పోలీసులు ఆ నగదుసు సీజ్​ చేశారు. క్యాష్​ తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ నగదును మునుగోడు ఉప ఎన్నిక కోసం తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి పవన్ రెడ్డి వద్దకు ఈ డబ్బు తీసుకెళ్తున్నట్లు పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు పేర్కొన్నారు. కోకాపేట వాసి సునీల్ రెడ్డి నుంచి కోటి రూపాయలు తీసుకెళ్తున్నట్లు వారు ఒప్పుకున్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి వెళ్లే దారుల్లో పోలీసులు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగదు తరలిస్తున్న వ్యక్తులను దేవరాజు, శ్రీకాంత్‌, విజయ్ కుమార్‌, నాగేశ్, దాసరి లూథర్‌గా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement