Thursday, April 25, 2024

పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని ప‌రామ‌ర్శించిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ..

ఏపీ పంచాయ‌తీరాజ్ , గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెంగ‌ళూరు వెళ్లారు. కాగా దివంగ‌త నటుడు క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ స‌తీమ‌ణి అశ్వినిని ప‌రామ‌ర్శించారు. . పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చాలా బాధించింది అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చిన్న వయస్సులో అనేక మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మందిని ఆదుకున్న గొప్ప మానవతావాది పునీత్ గారు అని గుర్తు చేశారు . ఆయన మృతి చిత్ర పరిశ్రమ తో పాటు సామాజిక కార్యక్రమాలకు తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement