Friday, May 3, 2024

Crick Buz: 325+276/7 డిక్లేర్డ్.. భారీ స్కోరు సాధించిన ఇండియా

ముంబ‌యిలోని వాంఖ‌డే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్ లో ఇండియా భారీ స్కోరు సాధించింది. మూడో రోజు 7 వికెట్లు కోల్పోయి 276 ప‌రుగులు చేసింది. కాగా, ఫ‌స్ట్ సెకండ్ ఇన్సింగ్స్‌లో క‌లిపి 539 ప‌రుగుల లీడ్ లో ఉంది. మ‌యాంక్ 62, పుజారా 47, శుభ్‌మ‌న్ గిల్ 47, కోహ్లీ 36, అయ్య‌ర్ 14, సాహా 13, జ‌యంత్ జాద‌వ్ 6 ప‌రుగులు చేశారు. అక్ష‌ర్ ప‌టేల్ (41) ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు.. అయితే టీమిండియా 276 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేయ‌డంతో న్యూజిలాండ్ జ‌ట్టు సెకండ్స్ ఇన్నింగ్స్‌కు దిగ‌నుంది. నిన్న ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 62 ప‌రుగుల‌కే ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement