Thursday, May 9, 2024

ప్ర‌ధానుల మ్యూజియం – ప్రారంభించిన మోడీ

ప్ర‌ధాన మంత్రుల మ్యూజియంని ప్రారంభించారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ. కాగా ఈ మ్యూజియంని న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. కాగా ఫ‌స్ట్ టిక్కెట్ ప్ర‌ధాని కొనుగోలు చేసి మ్యూజియంని సంద‌ర్శించ‌డం విశేషం. ఈ మ్యూజియంలో 14 మంది ప్ర‌ధానుల చ‌రిత్ర వుంటుంది. వారు దేశాన్ని ఎలా న‌డిపారు.. లాంటి విషయాలు తెలుసుకోవ‌చ్చే. ఇక భార‌త మొద‌టి ప్ర‌ధాని నెహ్రూ జీవితం, ఆయ‌న దేశానికి చేసిన సేవ‌ల‌కు సంబంధించి ఓ డిస్‌ప్లేను కూడా వుంచారు. అలాగే ప్ర‌పంచ వ్యాప్తంగా నెహ్రూకు వ‌చ్చిన బ‌హుమ‌తుల‌ను కూడా ఈ మ్యూజియంలో వుంచారు. దేశ ప్ర‌ధానులు ,వారి జీవితాలు, దేశం కోసం వారు ప‌డ్డ శ్ర‌మ‌… ఇలా మొత్తం కూడా ఇందులో పొందుప‌రిచారు. ఈ మ్యూజియంలో రెండు బ్లాకులు వుంటాయి. అందులో మొద‌టిది తీన్మూర్తి భ‌వ‌న్‌. రెండో బ్లాక్ పూర్తిగా కొత్త బ్లాక్‌. 15 వేల 600 చ‌ద‌ర‌పు మీట‌ర్ల కంటే ఎక్కువేన‌ని అధికారులు పేర్కొంటున్నారు.అభివృద్ధి చెందుతున్న భార‌త్ ను ప్రేర‌ణ‌గా తీసుకొని, ఈ భ‌వ‌న నిర్మాణం ఉంటుంద‌ని తెలిపారు. అయితే ఇంత‌టి మ్యూజియం నిర్మించే స‌మ‌యంలో ఒక్క చెట్టును కూడా న‌రికేయ‌లేద‌ని కూడా అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement