Sunday, April 28, 2024

సంత్ తుకారామ్ ఆల‌యాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని – చిడ‌త‌లు వాయించిన మోడీ

పూణేలో ప‌ర్య‌టించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తుంబుర‌..చిడ‌త‌లను బ‌హుక‌రించారు. దాంతో తుంబుర చేత‌బూని మోడీ చిడ‌త‌లు వాయించారు. పూణేలోని డెహూ ప్రాంతంలో సంత్ తుకారామ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మోడీ. 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు సంత్ తుకారామ్ పేరిట ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ పాలకమండలి సభ్యులు ప్రధాని మోదీకి తుంబుర, చిడతలు బహూకరించారు. సంత్ తుకారామ్ అభంగ పేరిట భక్తి సాహిత్యాన్ని లిఖించారు. అనేక కీర్తనలను రచించారు. ఆయన మరణానంతరం చిన్న శిల్పమందిరం ఏర్పాటు చేసినా, ఇటీవల దానికి ఆలయ రూపుని కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement