Monday, April 29, 2024

ప్ర‌ధాని మోడీ క్రేజే వేర‌ప్ప – యూట్యూబ్ లో ఏకంగా కోటి స‌బ్ స్క్ర‌యిబ‌ర్స్

యూట్యూబ్ లో ప్ర‌ధాని మోడీదే హ‌వా కొనసాగింది. ఆయ‌న‌కి కోటి దాటారు స‌బ్ స్క్ర‌యిబ‌ర్స్. మోడీని సోష‌ల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. ట్విట్టర్ పేజీలో ఆయన క్రేజీయే వేరు. యూట్యూబ్ లోనూ ఆయన యూజర్లను గణనీయంగానే ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ‘నరేంద్ర మోడీ’ పేరుతో ఉన్న ప్రధాని అధికారిక యూట్యూబ్ ఛానల్ ను సబ్ స్క్రయిబ్ చేసుకున్న వారి సంఖ్య కోటి మార్క్ ను దాటింది. ఈ విషయాన్ని ప్రసార భారతి న్యూస్ సర్వీసెస్ ట్విట్టర్ లో వెల్ల‌డించింది. ఇందుకు సంబంధించిన ఫొటోని పోస్ట్ చేసింది. యూట్యూబ్ పై ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన దేశీ నేతలను పరిశీలిస్తే..

రాహుల్ గాంధీకి 5.25 లక్షల మంది, శశి థరూర్ కు 4.39 లక్షల మంది, అసదుద్దీన్ ఒవైసీకి 3.73 లక్షల మంది, ఎంకే స్టాలిన్ కు 2.12 లక్షల మంది, మనీష్ సిసోడియాకు 1.37 లక్షల మంది చొప్పున యూట్యూబ్ చానళ్లపై సబ్ స్క్రయిబర్లు కలిగి ఉన్నట్టు ప్రసార భారతి న్యూస్ సర్వీసెస్ పోస్ట్ రూపంలో ప్రకటించింది. అంతర్జాతీయంగా మరే ప్రముఖ నేత కూడా యూట్యూబ్ చందాదారుల పరంగా మోడీకి సమీపంలో లేకపోవడం గమ‌నార్హం. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చానల్ సబ్ స్క్రయిబర్ల సంఖ్య 7.03 లక్షలు. అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ కు చందాదారులు 19 లక్షల మంది ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు 28.8 లక్షల మంది చందాదారులు ఉన్నారు. అలాగే, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయేల్ లోపెజ్ ఒబ్రాడర్ కు 30.7 లక్షల మంది, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో కు 36 లక్షల మంది చొప్పున సబ్ స్క్రయిబర్లు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement