Wednesday, May 15, 2024

Breaking: మంత్రుల క‌మిటీతో పీఆర్సీ స్టీరింగ్ క‌మిటీ భేటీ

ఏపీలో పీఆర్సీ ర‌గ‌డ కొన‌సాగుతోంది. ఈ ర‌గ‌డ స‌ద్దుమ‌ణిగేందుకు మ‌రోసారి మంత్రుల క‌మిటీతో పీఆర్సీ స్టీరింగ్ క‌మిటీ భేటీ అయ్యింది. ఈ భేటీలో రాష్ట్ర మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. అయితే ఈ స‌మావేశానికి స్టీరింగ్ క‌మిటీ నుంచి 20మందికి మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు.

అయితే ఈరోజు ఉద‌యం పీఆర్సీ స్టీరింగ్ క‌మిటీ స‌మావేశ‌మైంది. మంత్రుల క‌మిటీతో చ‌ర్చించాల్సిన ప‌లు అంశాల‌పై స్టీరింగ్ క‌మిటీ స‌భ్యులు ఈ స‌మావేశంలో చ‌ర్చించుకోవ‌డం జ‌రిగింది. ముందుగా ఈ స‌మావేశంలో చ‌ర్చించుకున్న అనంత‌రం స్టీరింగ్ క‌మిటీ స‌భ్యులు మంత్రుల క‌మిటీతో భేటీకి వెళ్లారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement