Thursday, May 2, 2024

కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపిన ప్ర‌ధాని మోడీ..అమిత్ షా- తెలుగులో ట్వీట్

సీనియ‌ర్ న‌టుడు కృష్ణంరాజు క‌న్నుమూశారు.ఈ నేప‌థ్యంలో . ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీ యువి కృష్ణంరాజు గారు మృతి చెందడం బాధాకరం. రాబోయే తరాలు ఆయన సినిమా తీపిని, సృజనాత్మకతను గుర్తుంచుకుంటాయి. సమాజ సేవలో కూడా ముందుండే ఆయన రాజకీయ నేతగా ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. ఓం శాంతి” అంటూ మోడీ ట్వీట్‌ చేశారు. తెలుగు సినిమా దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ యు కృష్ణంరాజు గారు మనల్ని విడిచిపెట్టారని తెలి‌సి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అతను బహుముఖ నటనతో .. సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మరణం మన తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చింది. ఓం శాంతి. అంటూ అమిత్ షా తెలుగులో ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement