Tuesday, April 30, 2024

స్కూల్ లో రాజ‌కీయం.. ఐ ల‌వ్ మ‌నీశ్ సిసోడియా బ్యాన‌ర్

ప్రభుత్వ స్కూలు ముందు ‘ఐ లవ్ మనీశ్ సిసోడియా’ అంటూ ఓ బ్యానర్ ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఈ బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనికి స్కూలు మేనేజ్ మెంట్ కమిటీ కో ఆర్డినేటర్ గజాలా, స్కూలు ప్రిన్సిపాల్ మద్దతుగా నిలవడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. అయినా వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని స్థానికులు చెబుతున్నారు. దీంతో పోలీసులు స్కూలు దగ్గరికి చేరుకుని బ్యానర్ ను తొలగించారు. బ్యానర్ కట్టిన వారిపై కేసు నమోదు చేశారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ఏరియాలో ఉన్న ప్రభుత్వ స్కూలు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు అభ్యంతరం చెప్పినా స్కూలు ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు.. కాగా బ్యానర్ ముందు పిల్లలను కూర్చోబెట్టి ఆప్ కార్యకర్తలు ఫొటోలు తీసుకున్నారని స్థానికులు చెప్పారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికుడు దివాకర్ పాండే మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయంతో సమానమైన స్కూలులోకి రాజకీయాలను తీసుకురావడం సరికాదని విమర్శించారు. పిల్లల మనసులను కలుషితం చేయడం తగదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement