Sunday, April 28, 2024

Huzurabad: ఎమ్మెల్యే ఈటలకు నోటీసులు.. విచారణకు రావాలన్న పోలీసులు

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కరీంనగర్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల వెలువడిన తరువాత నవంబరు 2వ తేదీన ఈటల తన అనుచరులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు తరువాత ఏ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు తీయడానికి వీళ్లేదని ఎన్నికల అధికారులు నిబంధనలు జారీ చేశారు.

అయితే ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కరీంనగర్‌ SRS డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీ చేపట్టారంటూ ఈటల రాజేందర్ తోపాటు ఆయన అనుచరులపైనా అప్పట్లోనే కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ర్యాలీ ఎన్నికల నిబంధనలు, కోవిడ్ రూల్స్‌కు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ కరీంనగర్ మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలోనే విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement