Thursday, May 2, 2024

పోల‌వ‌రం క‌ట్ట‌డం చేత‌కాక‌పోతే కేంద్రానికి అప్ప‌జెప్పండి : సోము వీర్రాజు

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ప్ర‌భుత్వంపై ఆయ‌న ఘాటుగా స్పందించారు. పోలవరానికి కేంద్రం నిధులివ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయ‌న‌ ఫైర్ అయ్యారు. అంచనాలు పెంచేశారని చంద్రబాబు పై విమర్శలు చేసిన ఇదే సీఎం జగన్.. ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారు..? అని ప్ర‌శ్నించారు. పోలవరం కట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకుంటే కేంద్రానికి అప్పజెప్పాల‌ని.. తామే నిర్మిస్తామ‌ని సోము వీర్రాజు స‌వాల్ విసిరారు. పోలవరం నిమిత్తం ఇప్పటి వరకు రూ. 11వేల కోట్లు ఇచ్చామ‌ని.. మరో రూ.700 కోట్లు ఇవ్వాల్సి ఉందని.. దీన్ని త్వరలో విడుదల చేస్తామ‌ని సోము వీర్రాజు అన్నారు. పోలవరం కట్టిన లెక్కల ప్రకారం నిధులను విడుదల చేస్తున్నామ‌ని…తెలిపారు. అన్నమయ్య ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి ప్రస్తావిస్తే షెకావత్తును తప్పు పడతారా..? అని సోము వీర్రాజు నిప్పులు చెరిగారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement