Thursday, May 2, 2024

ప్ర‌భుత్వ ఆఫీసుపై పోలీసులు దాడి.. బ్యాగు నిండా నోట్ల‌క‌ట్ట‌లే

ఓ ప్ర‌భుత్వ ఆఫీసుపై పోలీసులు దాడి చేయ‌గా ..కార్యాల‌యంలోని ఓ గ‌దిలో ఉన్న క‌బ్ బోర్డులో ఓ బ్యాగ్ ని గుర్తించారు. కాగా ఆ బ్యాగ్ ని తెర‌చి చూడ‌గా అధికారులు ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. ఆ బ్యాగు నిండా నోట్ల క‌ట్ట‌లతో పాటు బంగారు బిస్కెట్లు కూడా ఉన్నాయి.దీంతో ఆ బ్యాగ్ ని సీజ్ చేశారు పోలీసులు.ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. జైపూర్‌లోని ఐటీ శాఖకు చెందిన యోజనా భవన్‌లో లెక్కల్లోకిరాని డబ్బును అధికారులు గుర్తించారు. నిర్ధిష్టమైన సమాచారంతో యోజనా భవన్‌పై పోలీసులు దాడిచేశారు. ఈ సందర్భంగా ఓ బ్యాగ్‌లో రూ.2.31 కోట్ల నగదు, కిలో బరువున్న బంగారు బిస్కెట్లను గుర్తించారు. ఆ మొత్తాన్ని సీజ్‌చేసి ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అందజేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఆ డబ్బు, బంగారం ఆఫీసులోకి ఎలా వచ్చింది, అది ఎవరిదనేది గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృంధాన్ని ఏర్పాటుచేశామని జైపూర్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆనంద్‌ శ్రీవాత్సవ చెప్పారు. విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement