Thursday, May 16, 2024

200కోట్ల మార్క్ దాటిన క‌రోనా వ్యాక్సిన్ డోసులు- వ్యాక్సిన్ ఉత్ప‌త్తిదారుల‌కు ప్ర‌ధాని మోడీ లెట‌ర్

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దేశంలోని వ్యాక్సిన్ ఉత్ప‌త్తిదారుల‌కు ప్ర‌త్యేకంగా లెట‌ర్ రాశారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. జూలై 17 నాటికి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ 200 కోట్ల మార్క్‌ను దాటింది. భార‌త్ ఈ ఘ‌న‌త‌ను కేవ‌లం 18 నెలల్లోనే సాధించింది. మీ క్రియాశీల భాగస్వామ్యంతో భారతదేశం మరోసారి చరిత్ర సృష్టించింది. కరోనా పై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ 16 జనవరి 2021న ప్రారంభమైంది. ఈ పోరాటంలో 17 జూలై 2022న ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాం. ఇది దేశానికి చిరస్మరణీయమైన రోజు. ఎందుకంటే.. 200 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించి ల‌క్ష్యాన్ని సాధించాం.

ఈ ప్రపంచ మహమ్మారి సమయంలో టీకా ప్రచారంలో పాల్గొన్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు సహా ఫ్రంట్‌లైన్ కార్మికులు చేసిన సేవ‌ల‌ను ప్ర‌శంసించారు ప్ర‌ధాని మోడీ. శతాబ్దపు అతిపెద్ద ప్రపంచ మహమ్మారి సమయంలో ప్రాణాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మ‌న వ్యాక్సినేటర్లు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఆరోగ్య సంరక్షణ సహాయక సిబ్బంది, ఫ్రంట్‌లైన్ కార్మికులు మన దేశ ప్రజల భద్రతలో కీలక పాత్ర పోషించారు. సంక్షోభ సమయాల్లో వారి కర్తవ్య భక్తి ప్రశంసనీయం. COVID-19కి వ్యతిరేకంగా మా పోరాటంలో ఇది అద్భుతమైన విజయమ‌ని అన్నారు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లిన తీరు అమోఘం. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంగా ఇంత వేగంగా, పెద్ద ఎత్తున సాగ‌డానికి కార‌ణ‌మైన వారిని, కరోనాపై పోరాటంలో భారత్ పాత్రను కీర్తిస్తూనే ఉంటాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement