Sunday, April 28, 2024

దేశంలో తొలి ప్యాసింజర్​ డ్రోన్​.. ‘వరుణ’ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ (వీడియో)

దేశంలో తొలి ప్యాసెంజర్​ డ్రోన్​ ‘వరుణ’ని ఇవ్వాల  (బుధవారం) కొద్దిసేపటి క్రితమే  ప్రధాని మోదీ ఆవిష్కరించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ షేర్ చేసిన వీడియోలో ప్రధాని డ్రోన్ పనితీరును చూస్తున్నారు. కాగా, మనుషులను మోసుకెళ్లగల భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ ‘వరుణ’ ఆవిష్కృతమైంది. ఇది 25 కిలోమీటర్ల పరిధిలో.. 130 కిలోల బరువును మోసుకెళ్తుంది. 25-33 నిమిషాల ఎయిర్​ టైమ్​ని కూడా కలిగి ఉంటుంది.

అయితే.. ఈ ఏడాది మేలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో డ్రోన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. “మేము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నాం. ఈ తరుణంలో దేశంలోని ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాలనేది నా కల.  ప్రతి పొలంలో డ్రోన్ ఉండాలి. ప్రతి ఇల్లు శ్రేయస్సు కలిగి ఉండాలి.” అని ఆకాంక్షించారు. ప్రస్తుత ప్రభుత్వం డ్రోన్‌లతో సహా.. ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో సేవలను మరింత మెరుగుపడేలా చేస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement