Sunday, April 28, 2024

మళ్లీ వస్తా, మీ ప్రేమను వడ్డీతో సహా తీరుస్తా.. సభలో మాట్లాడకుండానే వెనుదిరిగిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్​లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే.. సభా ప్రాంగణానికి చేరుకునే సరికి రాత్రి ఆలస్యం అయ్యింది. అక్కడ రాత్రివేళ లౌడ్​ స్పీకర్లు, మైకులు వాడొద్దన్న రూల్స్​ ఉన్నాయి. దీంతో సభలో మాట్లాడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే.. దీనికి ప్రధాని మోదీ సభకు వచ్చిన వారందరికీ క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే.. ఇంతదూరం తన కోసం వచ్చిన మీ ప్రేమను అభినందిస్తున్నాని, కానీ, కొన్ని రూల్స్​ వల్ల మీ ముందు మైకులో మాట్లాడలేకపోతున్నానని అన్నారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

రాజస్థాన్‌ రాష్ట్రం సిరోహిలోని అబు రోడ్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మైక్రోఫోన్‌ను ఉపయోగించకుండా, ఎట్లాంటి మైక్​ సెట్​ లేకుండా మాట్లాడారు. దీనికి వేదిక వద్దకు ఆలస్యంగా రావడమే కారణంగా తెలుస్తోంది. లౌడ్‌స్పీకర్ నియమాలు, నిబంధనలను పాటించాలని తాను కోరుకుంటున్నట్లు  ఈ సందర్భంగా మోదీ చెప్పారు.

మైక్ ఉపయోగించకుండా ఆయన చేసిన సంక్షిప్త ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీడియోలో అతను ప్రసంగించలేకపోయినందుకు సభకు ముందు క్షమాపణలు చెప్పారు. తాను మళ్లీ సిరోహికి వస్తానని అందరికీ హామీ ఇచ్చారు.

“నేను చేరుకోవడం ఆలస్యమైంది. ఇప్పుడు  రాత్రి 10 గంటలవుతోంది. నియమాలు, నిబంధనలను పాటించాలని నా మనస్సాక్షి చెబుతోంది. కాబట్టి, నేను మీ ముందు క్షమాపణలు కోరుతున్నాను” అని మైక్, లౌడ్‌స్పీకర్ లేకుండా మాట్లాడుతూ ప్రధాని మోదీ అన్నారు. అయితే, నేను మళ్లీ ఇక్కడికి వస్తానని, మీరు నాకు ఇచ్చిన ప్రేమను వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని మీకు వాగ్దానం చేస్తున్నా” అని చెప్పారు.

- Advertisement -

ప్రధాని మోదీ వేదికపైకి వంగి “భారత్ మాతా కీ జై” అనే నినాదం చేయగా.. దీనిని ప్రజల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్​ వచ్చింది. అనేక మంది బిజెపి నాయకులు, సోషల్ మీడియా యూజర్లు..  మైక్రోఫోన్, లౌడ్ స్పీకర్ నిబంధనలను అనుసరించారని ప్రశంసించారు.

రాజస్థాన్‌లో ప్రధాని మోదీ

అంతకుముందు ప్రధాని మోదీకి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా, మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా, డిప్యూటీ రాజేంద్ర రాథోడ్ స్వాగతం పలికారు. సిరోహి, దుంగార్‌పూర్, బన్స్వారా, చిత్తోర్‌గఢ్, ప్రతాప్‌గఢ్, బన్స్వారా, పాలి, ఉదయ్‌పూర్ వంటి జిల్లాల నుండి పార్టీ కార్యకర్తలు, 40 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని సమీప ప్రాంతాల నుండి ర్యాలీకి తరలివచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌తో సరిహద్దును పంచుకునే దక్షిణ రాజస్థాన్‌లోని పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని పెంపొందించడానికి, ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ ర్యాలీని ప్లాన్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో కూడా వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని అంబాజీ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అబూ రోడ్‌కు చేరుకున్నారు. పట్టణంలో జరిగిన ర్యాలీకి ముందు ఆయన ఆలయాన్ని సందర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement