Sunday, May 12, 2024

TSPD | పదోన్నతి పొందిన 141 మంది డీఎస్పీల‌కు పైపింగ్ కార్యక్రమం.. డీజీపీ అభినంద‌న‌లు

తెలంగాణ అవతారణ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ స్టేట్​ పోలీస్​ డిపార్ట్​ మెంట్​ (TSPD)కు చెందిన పురస్కరించుకొని 141 మంది పదోన్నతి పొందారు. పదోన్నతి పొందిన DSPలను డీజీపీ అంజనీ కుమార్ ఇవ్వాల (సోమ‌వారం) అభినందించారు. ఈ పోలీస్ అధికారులకు సోమ‌వారం డీజీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో పైపింగ్ వేడుకలు నిర్వహించారు. ప్రమోషన్ ప్రక్రియలో ఈ వేడుక ముఖ్యమైన కార్యక్రమం. కొత్తగా పదోన్నతి పొందిన అధికారులకు అధికారం, బాధ్యతల బదిలీని జరుగుతుంది.

ఈ పైపింగ్ వేడుకకు సీనియర్ పోలీస్ అధికారులు ADG L&O సంజయ్ జైన్, ADG CID మహేష్ M భగవత్, ADG కోఆర్డినేషన్ ADG అభిలాషా భిస్ట్, IGP మల్టీ జోన్ షానవాజ్ ఖాసీం, IGP శిక్షణ తరుణ్ జోషి తదితరులు హాజరయ్యారు. సీనియర్ అధికారుల సమక్షంలో జరిగిన ఈ పైపింగ్ వేడుక పదోన్నతి పొందిన అధికారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని డీజీపీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement