Sunday, April 28, 2024

మరోసారి పెరిగిన పెట్రో ధరలు..

మన దేశంలో పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న పెట్రో ధ‌ర‌లు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచ‌రీ కూడా దాటేశాయి. ఇవాళ పెట్రోల్ ధ‌ర‌లు పెరిగాయి.. డీజిల్ ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్‌పై రూ. 29 పైస‌లు పెర‌గ‌గా, డీజిల్‌పై రూ. 17 పైస‌లు త‌గ్గింది. దీంతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 105.15 కాగా, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 97.79. ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 101.19, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 89.72, ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ. 107.20, డీజిల్ 97.29, భోపాల్‌లో పెట్రోల్ ధ‌ర రూ. 109.53, డీజిల్ ధ‌ర రూ. 98.50, కోల్‌క‌తాలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 101.35 కాగా, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 92.81గా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక పిలుపు

Advertisement

తాజా వార్తలు

Advertisement