Sunday, April 28, 2024

స‌ర్కారు వారి పాట చిత్రం నుంచి – ‘పెన్ని’ ఫుల్ సాంగ్

ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు, కీర్తి సురేశ్ జంట‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా కు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ , గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇది ఇలా ఉండగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా సెకండ్‌ సింగిల్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. “పెన్ని” అంటూ సాగే.. ఈ పాటలో మహేష్ బాబు కుమారై సితారా చాలా బాగా డ్యాన్స్‌ చేసింది. అటు మహేష్‌ బాబు కూడా చాలా క్యూట్‌ గా ఉన్నాడు. కళ్లజోడు పెట్టుకుని మెరిసిపోతున్నాడు. తండ్రి, కూతురు తెర‌పై క‌నిపిస్తే ప్రేక్ష‌కుల‌కి పండ‌గే.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement